కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థులుగా పాత పెద్దలే

Congress
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్రం నుంచి పోటీ చేసే రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పాతవారికే రాజ్యసభ సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుండగా నలుగురికి మాత్రమే ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో ఐదుగురిలో ఎవరిని పక్కన పెట్టాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, గిరీష్ సంఘీల్లో ఎవరో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి ఉంది.

కాగా, జైరాం రమేష్, జెడి శీలం, వి హనుమంతరావుల పేర్లు రాజ్యసభకు ఖరారైనట్లు తెలుస్తోంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏదో రాష్టానికి గవర్నర్ గా పంపి గిరీష్ సంఘీకి అవకాశం కల్పించే ఆలోచన కూడా కాంగ్రెసు అధిష్టానం చేస్తోంది. తాను ఏడాది పాటు మాత్రమే రాజ్యసభలో ఉన్నానని, అందువల్ల తనకు మరోసారి అవకాశం కల్పించాలని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోరుతున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి అవకాశం కల్పించాలనుకుంటే గిరీష్ సంఘీకి టికెట్ దక్కకపోవచ్చు. మరోసారి అవకాశం కల్పిస్తామని పార్టీ అధిష్టానం గిరీష్ సంఘీని సముదాయించే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+