వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఫల్యాల వల్లే జగన్ గొడవ ముందుకు: ఇంద్రసేనా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Indrasena Reddy
కరీంనగర్: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెసు ప్రభుత్వం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వివాదాన్ని ముందుకు తెచ్చిందని బిజెపి జాతీయ కార్యదర్శి ఎన్. ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెసు ప్రభుత్వం పార్టీ అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనానికి వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చివరకు పబ్లిసిటీ కమిటీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎరువులు, విత్తనాలపై వెంటనే శ్వేతపత్రం విడుదుల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఎంసెట్ ను నిర్వహిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థులు, రైతుల విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X