రామోజీ ఈనాడు రాతలపై సాక్షి డైలీ మండిపాటు

ఈనాడుపై కూడా సాక్షి దినపత్రిక వార్తాకథనం దుమ్మెత్తిపోసింది. విజయవాడ నుంచి జగన్ రహస్యంగా రైల్లో హైదరాబాదు వచ్చారని ఈనాడు రాసిన వార్తాకథనాన్ని ప్రముఖంగా ఎత్తిచూపింది. జగన్ వచ్చింది రోడ్డు మార్గంలో అయితే ఈనాడు రైల్లో వచ్చినంటూ రాసిందని వ్యాఖ్యానించింది. జగన్ ను రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు తెలంగాణవాదులు నల్లగొండ జిల్లాలో అడ్డుకున్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన వార్తా కథనంపై నిప్పులు చెరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తా కథనాలను సాక్షి దినపత్రిక ఎల్లో సిండికేట్ క్షుద్ర రాతలుగా అభివర్ణించింది. పచ్చరాతలు అనడాన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలు అని చెప్పడానికే. ఎల్లో సిండికేట్ చెప్పింది ప్రజలు నమ్మి ఉంటే చంద్రబాబు శాశ్వత సిఎంగా మిగిలేవారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications