హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు సోనియాతో భేటీ: ఉప ఎన్నికలపై డి శ్రీనివాస్ మల్లగుల్లాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: తెలంగాణలో 12 శాసనసభా నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మల్లగుల్లాలు పడుతున్నారు. పోటీ చేయాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి అభ్యర్థులను గెలిపించడం ఆయకు కష్టంగానే ఉంది. సోమవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలుసుకుని ఉప ఎన్నికలపై చర్చించారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన ఈ చర్చలు జరిపారు.

రేపు మంగళవారం డిఎస్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై చర్చిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మాట్లాడుతారు. అలాగే, పార్టీ అభ్యర్థులపై కూడా ఆయన సోనియాతో మాట్లాడే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X