తెలంగాణలో పోటీపై పునారాలోచన చేయాలి: దామోదర్ రెడ్డి
జలయజ్ఞంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ తమ పార్టీ సీనియర్ నాయకులు గవర్నర్ కలవడం అర్థరహితమని ఆయన అన్నారు. జలయజ్ఞంలో అవకతవకలు జరిగి ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవడం సమంజసంగా ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్పందించుకుంటే అప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడడం సిఎల్పీ సంప్రదాయానికి విరుద్ధమని ఆయన అన్నారు. పార్టీ వద్దంటున్నా సీనియర్లు గవర్నర్ ను కలవడం వెనక రహస్య ఎజెండా ఉందనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. జలయజ్ఞంలో అక్రమాలకు సంబంధించి ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
దామోదర్ రెడ్డి కాంగ్రెసు తెలంగాణ ఉప ఎన్నికలు హైదరాబాద్ damodar reddy congress telangana by polls hyderabad
Story first published: Wednesday, June 16, 2010, 15:37 [IST]