పవన్ ఆగ్రహం..! 24 గంటల్లో చంద్రబాబు కీలక ఉత్తర్వులు..!

ఏపీలోని నదుల కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల తీరుపై నిన్న గోదావరి తీరాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపైనా మండిపడ్డారు. కాలుష్య కారక పరిశ్రమలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు. దీంతో 24 గంటల్లోనే కూటమి సర్కార్ స్పందించింది. వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితోపాటు ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.

AP Govt: ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు యత్నాలు? తేల్చేసిన ఏపీ సర్కార్..!
AP Govt: ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు యత్నాలు? తేల్చేసిన ఏపీ సర్కార్..!

నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిన్న పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు ఇచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్.. నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా పవిత్రమైన గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Pawan Kalyan s Warning Works Chandrababu Launches Special Taskforce to Fight River Pollution in AP
Prof. Nageswar: ఏపీ సర్కార్ కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్..! కీలక ప్రశ్నలు..!
Prof. Nageswar: ఏపీ సర్కార్ కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్..! కీలక ప్రశ్నలు..!

పుష్కరాలకు వచ్చే భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదని, ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పవన్ ఆదేశాలతో గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ టాస్క్ ఫోర్స్.. నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతోపాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించనుంది. ఈ కమిటీ ప్రతి15 రోజులకు ఒకసారి సమావేశమై ప్రధాన నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తించి చర్యలు తీసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+