హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాష్ స్కామ్: సాక్షి దాడితో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కదిరిలో పట్టుబడిన ఏడు కోట్ల రూపాయల క్యాష్ స్కామ్ తో లింక్ పెడుతూ సాక్షి టీవీ చానెల్ దాడి చేస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాను చంద్రబాబుకు బంధువునని పోలీసులకు పట్టుబడిన టిడిపి నేత పేరం హరిబాబు తండ్రి రామకృష్ణయ్య చెప్పడం, క్యాష్ దొరికిన వాహనంలో చంద్రబాబు వాహనం నెంబర్ ప్లేటు ఉండడాన్ని ఆసరాగా తీసుకుని సాక్షి టీవీ చానెల్ చంద్రబాబుపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెడుతోంది. దీంతో చంద్రబాబు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారని అంటున్నారు. పార్టీ నాయకుడు వర్ల రామయ్య చంద్రబాబును సమర్థిస్తూ, సాక్షి టీవీ చానెల్ పై విరుచుకపడడం సరిపోవడం లేదని భావిస్తున్నారు.

ఏడు కోట్ల రూపాయల వ్యవహారంపై వార్తాకథనాలు వస్తుండడంతో చంద్రబాబు చంద్రగిరి తెలుగుదేశం నాయకులకు ఫోన్ల మీద ఫోన్లు చేసినట్లు సమాచారం. అదే విధంగా పేరం హరిబాబుకు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు తనది కాదని, డబ్బు రవాణాకు వాడిన వాహనం మాత్రం తనదేనని పేరం హరిబాబు జిల్లా ఎస్పీకి చెప్పారు. ఆయన గురువారంనాడు జిల్లా ఎస్పీని కలిసి వివరణ ఇచ్చారు. అయితే, ఆ డబ్బు హరిబాబుదేనని వర్ల రామయ్య చెప్పడం మరింత ఇబ్బందికరంగా మారింది.

కాగా, డబ్బు రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు గురువారంనాడు కోర్టు ముందు హాజరు పరిచారు. ఆ ఐదుగురిలో హరిబాబు తండ్రి రామకృష్ణయ్య కూడా ఉన్నారు. ఆ డబ్బు ఓ చిట్ ఫండ్ కంపెనీదని, కర్నాటకలోని బ్యాంక్ నుంచి దాన్ని డ్రా చేసుకుని వస్తున్నామని నిందితులు చెప్పినట్లు సమాచారం. అంతకు మించి నిందితులు పోలీసులకు ఏం చెప్పారనే విషయాలు వెల్లడి కావడం లేదు. ఆ డబ్బు ఇనుప ఖనిజానికి సంబంధించిందనే వార్తలు కూడా వస్తున్నాయి. పేరం హరిబాబు కొందరు కాంగ్రెసు నాయకులతో కలిసి వ్యాపారం సాగిస్తున్నారని, ఆ వ్యాపారానికి సంబంధించిందే ఆ డబ్బు అనే ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెసు నాయకులు హరిబాబును ఇరికించారనే దిశగా కూడా ఆలోచన సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X