హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి సోదాలు: ఆ అధికారి ఆస్తులు పది కోట్లపైనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి మూడు అవినీతి తిమింగలాలు చిక్కాయి. ముగ్గురు అవినీతి అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం దాడులు చేశారు. వారు కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఎసిబి సోదాల్లో బయటపడింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి) జోనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి ఆస్తులను చూస్తే దిమ్మ తిరిగే పరిస్థితి. హైదరాబాదులోని చైతన్యపురిలో గల గోపాల్ రెడ్డి ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతనికి పది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఈ దాడుల్లో తేలింది. గోపాల్ రెడ్డికి హైదరాబాదులో నాలుగు ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా పొలం ఉన్నట్లు కూడా సోదాల్లో తేలింది. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.

కాగా, శ్రీకాకుళం జిల్లా డ్వామా పీడీ నారాయణరావు నివాసంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన స్వస్థలం రణస్థలం మండలం కొండములగాంలోని నివాసంలోను సోదాలు జరిగాయి. అతను 50 లక్షల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలోని గృహనిర్మాణ శాఖ ఎఇ ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఇతను నారాయణరావు వ్యాపార భాగస్వామి. ఇతని నివాసంలో కూడా 50 లక్షల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X