తెలంగాణ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉప ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఈనెల 24న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన రద్దయింది. షెడ్యూల్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలను మినహాయించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆరోపించారు. దీనిని కోర్టులో సవాల్ చేస్తామని ఆయన ప్రకటించారు. షెడ్యూలు విడుదలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ సమర సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే అంతర్గతంగా తమ శ్రేణులను ఈ ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇకపై అభ్యర్థుల ఖరారు, ప్రచార వ్యూహం, వనరుల సమీకరణ వంటి అంశాలపై దృష్టి పెట్టాయి.












Click it and Unblock the Notifications