ఏడు కోట్ల వ్యవహారం నాకు సంబంధించింది కాదు: బాబు

Chandrababu Naidu
విజయనగరం: అనంతపురం జిల్లా కదిరిలో పట్టుబడిన ఏడు కోట్ల రూపాయల వ్యవహారం తనకు సంబంధించిన వ్యవహారం కాదని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెసు నాయకులు ఈ వ్యవహారంలో దివాళాకోరు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వ్యాపారాలు చేస్తున్నారని, వారు తప్పు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. మద్య నియంత్రణ ఉద్యమంలో భాగంగా చంద్రబాబు మంగళవారం రెండో రోజు బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను వారానికి రెండు రోజులు జిల్లాల్లో పర్యటిస్తానని, మద్య నియంత్రణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేతకాని తనం వల్ల గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్సిచారు.

అణు, ధర్మల్ విద్యుత్కేంద్రాలను శ్రీకాకుళం జిల్లాలో కేంద్రీకృతం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ను రైతుల కోసం నిర్మించడం లేదని, నాయకుల కోసం నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. తోటపల్లి రిజర్వాయర్ కు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో బెల్టు షాపులతో ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. జలయజ్ఞం పథకాన్ని పేదల కోసం కాకుండా నాయకుల కోసం చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాలు గిరిజనుల ఆమోదంతోనే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సంక్షేమ పథకాల అమలులో వివక్ష తగదని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు ఇరు ప్రాంతాల నాయకులు ప్రతిస్పందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+