విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణాడెల్టాకు నీరు విడుదల, వృధా కాకుండా టాస్క్ ఫోర్స్

By Santaram
|
Google Oneindia TeluguNews

Prakasam Barrage
విజయవాడ: ఈ వారం నుంచి కృష్ణా డెల్టా రైతులకు చేతినిండా పనే. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణాడెల్టాకు జిల్లా కలెక్టర్‌ పీయూష్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్ ‌లో మొత్తం ఏడు లక్షల ఎకరాలకు నీరు విడుదల అయ్యింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీరు దుర్వినియోగం కాకుండా జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.

ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లకు 180 నుంచి 200కు పైగా టీఎంసీల నీరు అవసరమవుతోంది. అయితే ఈ ఏడాది 120 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఖరీఫ్‌కు 75 టీఎంసీల నీటినే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణా డెల్టాలో నారుమళ్ల కోసం 25 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X