హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్రో ధరలపై సిఎం రోశయ్యపై చిరంజీవి లేఖాస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: పెట్రో ధరల పెంపుపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యపై లేఖాస్త్రం సంధించారు. పెరిగిన పెట్రో ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని కోరుతూ చిరంజీవి ఆ లేఖ రాశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల భారంతో మధ్యతరగతి ప్రజానీకం సతమతమవుతున్నారని, తాజాగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కిరోసిన్‌ ధరలు వారికి అదనపు భారమని ఆయన అన్నారు.

ప్రజల ఆదాయం పది శాతం కూడా పెరగట్లేదని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 20 నుంచి 30 శాతం ఆర్థిక భారాన్ని వారిపై మోపుతున్నాయని అన్నారు. భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను గణనీయంగా తగ్గించాలని కోరారు. గ్యాస్‌ సిలిండర్‌పై ప్రభుత్వం సబ్సిడీ అందించి ఆదుకోవాలని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X