హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్‌: వేములవాడ, సిరిసిల్ల శాసనసభా స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని పది స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటిస్తూ సిరిసిల్ల, వేములవాడ స్థానాలకు ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇసి నిర్ణయాన్ని తెరాస హైకోర్టులో సవాల్ చేసింది. ఆ రెండు స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును తెరాస హర్షించింది. హైకోర్టు తీర్పును తమ విజయంగా తెరాస నాయకులు నిరంజన్ రెడ్డి, నాయని నర్సింహారెడ్డి అభివర్ణించారు. కోర్టులో కేసులు ఉన్నాయంటూ ఇసి ఆ రెండు స్థానాలకు ఎన్నికలను వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X