వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా క్లాస్: వైయస్ జగన్ యాత్రపై లభించని హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ విధమైన హామీ ఇప్వలేదని తెలుస్తోంది. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, నియోజకవర్గం స్థాయిలో కష్టపడి పనిచేయి అని ఆమె జగన్ కు క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆమె చెప్పకనే చెప్పినట్లు భావిస్తున్నారు. దీంతో జగన్‌ ఓదార్పుయాత్రపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ప్రస్తుతానికి యథాతథస్థితి కొనసాగుతుందని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. యాత్ర అనుమతి కోరుతూ మంగళవారం సాయంత్రం 6.30కు తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిళతో కలిసి సోనియా నివాసంలో అడుగుపెట్టిన కడప ఎంపీ, అధినేత్రితో పావుగంటపాటు సమావేశమయ్యారు. భేటీ తర్వా వెనకదారి గుండా మీడియా కంటబడకుండా వెళ్లిపోయారు. అటు నుంచి అటే విమానాశ్రయానికి దారితీశారు. మంగళవారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

వచ్చే నెల 8న వై.ఎస్‌. జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి రెండో విడత ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న జగన్‌ దానికి సోనియాను అనుమతి కోరినట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. కడప ఎంపీ, ఆయన కుటుంబసభ్యులు చెప్పింది సావధానంగా విన్న సోనియా, యాత్రపై ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. విషయాన్ని పరిశీలిస్తానని అన్నట్లు సమాచారం. సాధారణంగా సోనియా ఎప్పుడూ నేరుగా నిర్ణయాలు ప్రకటించరు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే తన ప్రతినిధుల ద్వారా వెల్లడిస్తుంటారు. జగన్‌ యాత్ర విషయంలోనూ అదే ఆనవాయితీని పాటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 2న ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాతే జగన్ ఓదార్పు యాత్రపై నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X