వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు నో చాన్స్?

సాక్షి దినపత్రికలో ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చారా, లేదా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వార్తాకథనాన్ని ప్రచురించారు. జగన్, విజయలక్ష్మి చెప్పిన మాటలు సోనియా సావధానంగా విన్నారని, భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని సాక్షి దినపత్రికలో రాశారు. దీన్ని బట్టి సోనియా ఓదార్పు యాత్రపై జగన్ కు ఏ విధమైన హామీ ఇవ్వలేదని స్పష్టంగానే తెలుస్తోంది. విజయలక్ష్మి రాసిన లేఖకు ప్రతిస్పందనగా మర్యాద కోసం మాత్రమే జగన్ కుటుంబ సభ్యులను సోనియా కలుసుకోవడానికి అనుమతిచ్చారని, ఓదార్పు యాత్రకు అనుమతిచ్చే విషయంపై చర్చలకు కాదని తెలుస్తోంది. విజయలక్ష్మి లేఖ రాసిన తర్వాత కూడా తాను కలుసుకోక పోతే పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లవుతుందని, దానిపై విమర్సలు రావచ్చునని, అలాంటి విమర్శలు రాకుండా చూసుకోవడానికి మాత్రమే సోనియా అపాయింట్ మెంటు ఇచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications