ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టు ఆజాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Azad
ఆదిలాబాద్‌: మావోయిస్టు నేత అజాద్‌ భౌతికకాయానికి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో శనివారం పోస్టుమార్టం పూర్తయింది. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్సులో భౌతికకాయాన్ని హైదరాబాద్‌ తరలించారు. ఆదివారం హైదరాబాదులోని పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పోస్టుమార్టం సందర్బంగా ఆస్పత్రిలోనికి ఆజాద్ తల్లిని మాత్రమే అనుమతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆ అనుమతి ఇచ్చారు.

కాగా, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్ కూడా మంచిర్యాలకు చేరుకున్నారు. వారిద్దరిని పోలీసులు లోనికి అనుమతించలేదు. పోలీసుల తీరుపై వారు తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సమయంలో మంచిర్యాల ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X