Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మావోయిస్టు ఆజాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Azad
ఆదిలాబాద్‌: మావోయిస్టు నేత అజాద్‌ భౌతికకాయానికి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో శనివారం పోస్టుమార్టం పూర్తయింది. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్సులో భౌతికకాయాన్ని హైదరాబాద్‌ తరలించారు. ఆదివారం హైదరాబాదులోని పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. పోస్టుమార్టం సందర్బంగా ఆస్పత్రిలోనికి ఆజాద్ తల్లిని మాత్రమే అనుమతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆ అనుమతి ఇచ్చారు.

కాగా, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్ కూడా మంచిర్యాలకు చేరుకున్నారు. వారిద్దరిని పోలీసులు లోనికి అనుమతించలేదు. పోలీసుల తీరుపై వారు తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సమయంలో మంచిర్యాల ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+