శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోంపేట పవర్ ప్లాంట్ వద్ద ఆందోళన: పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikakulam Power Plant
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోంపేటలో థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంటు శంకుస్థాపన పనులను స్థానిక ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రాంతంలోకి స్థానికులు కర్రలతో ప్రవేశించారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సరుబుజ్జిలి హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. మీడియా ప్రతినిధులపైనా ఆందోళనకారులు దాడి చేశారు. ఓ టీవీ ఛానెల్‌ కెమెరామెన్‌కు గాయాలయ్యాయి.

తొలుత ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. తర్వాత లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, ఆందోళనలో పాల్గొనడానికి వస్తున్న ఇచ్చాపురం తెలుగుదేశం శాసనసభ్యుడు పి. సాయిరాజ్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X