హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగువాడి దమ్ము, పౌరుషం చూపిద్దాం: జూ ఎన్టీఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల పట్ల వ్యవహరించిన తీరుకు తెలుగువాడి దమ్ము, పౌరుషం ఏమిటో చూపిద్దామని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కేంద్రంలోనూ, రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉందని, కాంగ్రెసుకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. కాంగ్రెసు అన్యాయం అంతా ఇంతా కాదని ఆయన విమర్సించారు. తెలుగువాడి ఆత్మగౌరవం మరోసారి ప్రమాదంలో పడిందని, తెలుగువాడిని మోసం చేస్తున్నారని, ఈ స్థితిలో పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు.

తాము ఎన్టీఆర్ కు మాత్రమే వారసులం కాదని, ఎన్టీఆర్ ఆదర్శాలకు కూడా వారసులమని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని, తెలుగువారిని మద్రాసీలు అంటున్న కాలంలో తెలుగువారికి ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపం చెందిన ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X