వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలపై మహా పోలీసుల దౌర్జన్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ధర్మాబాద్: నారా చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం నాయకుల పట్ల మహారాష్ట్ర పోలీసులు మంగళవారం ఉదయం దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసులు మంగళవారం ఉదయమే తెలుగుదేశం నాయకులున్న గదుల తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రాత్రి నుంచి కూడా తెలుగుదేశం నాయకులు మౌన దీక్షలో ఉన్నారు. తెలుగుదేశం నాయకులపై లాఠీచార్జీ చేశారు. తమ పట్ల మహారాష్ట్ర పోలీసులు దౌర్జన్యం చేశారని, అమానుషంగా ప్రవర్తించారని తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కన్నా ఘోరంగా మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల ప్రవర్తించారని మరో ఎమ్మెల్సీ సిద్ధరాఘవయ్య విమర్సించారు.

ఎట్టి పరిస్థితిలోనూ తమ బాబ్లీ పోరాటం ఆగిపోదని శాసనసభ్యుడు నారాయణ రెడ్డి అన్నారు. పోలీసులు తమను బూట్లతో తన్నారని శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు పట్ల కూడా పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రతినిధులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులను ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం. తొలుత ఆంధ్రప్రదేశ్ లో వారిని వదిలేస్తారని భావించారు. అయితే, జ్యుడిషియల్ కస్టడీలో ఉండడంతో వారిని జైలుకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X