వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో ఫకీర్ చిన్నారిని నరికి, నెత్తురు తాగాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Madurai
మధురై: తమిళనాడులో పాపను బలి ఇచ్చిన సంఘటన వెలుగు చూసింది. ఓ ఫకీర్ ఏడాదిన్నర వయస్సు గల పాపను అపహరించి, బలిచ్చి, ఆ పాప శరీరావయవాలను రెండు వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు. అతీత శక్తులను పొందడానికి అతను ఈ పని చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అతను పాప రక్తం సేవించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫకీర్ తో పాటు ఈ సంఘటనలో పాలు పంచుకున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప అవయవాలను రామనాథపురం జిల్లాలోని ఓ దర్గా వద్ద, తలను థూత్ కుడి జిల్లా కల్లమోజి వద్ద పోలీసులు కనిపెట్టారు. అబ్దుల్ గఫూర్ అనే ఫకీర్ కాళి అమ్మన్ అనే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ బలికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

జి ఖాదర్ యూసుఫ్ అనే చిన్నారి బాలుడిని ఫకీర్ మదురైలోని గొరిపాలాయం దర్గా నుంచి జులై 2వ తేదీన కిడ్నాప్ చేశాడు. విధవరాలైన షెరీనా ఫాతిమా ఆ బాలుడితో దర్గాలోనే కాపురం ఉంటోంది. తన సహచరురాలు రమాలా బీవీకి చికిత్స అందించడానికి వెళ్లినప్పుడు ఫకీర్ ఆ బాలుడిని చూశాడు. గఫూర్, రమాలా బీవీ ఆ చిన్నారిని రామనాథపురంలోని లాడ్జికి తీసికెళ్లారు. చిన్నారి ఏడ్పు లంకించుకోవడంతో ఫకీర్ అతని గొంతు విరిచాడు. ఆ తర్వాత బాలుడిని నరికి తలను ఏర్వాడి దర్గా వద్ద కుట్టుపల్లివసల్ లో పూడ్చిపెట్టాడు. గఫూర్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి మదురైకి తెచ్చారు. అతను చూపిన వివరాల ప్రకారం తవ్వకాలు జరిపి చిన్నారి శరీరావయవాలను పోలీసులు వెలికి తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X