హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: ఐవి సుబ్బారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

IV Subba Rao
హైదరాబాద్‌: ఉప ఎన్నికలు జరగుతున్న 12 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. రెండు మూడు చోట్ల ఇవియంలు తొలుత మొరాయించినప్పటికీ పోలింగ్ సజావుగా జరుగుతోందని ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఐదు గంటల వరకు పోలింగ్ బూత్ లకు వచ్చినవారంతా ఓటు వేయవచ్చునని ఆయన అన్నారు.

వివిధ ప్రాంతాల్లో ఓటింగ్‌ మొదటి రెండు గంటలు సగటున పది శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపారు. సిర్పూర్‌లో 10 శాతం, చెన్నూరులో 15, మంచిర్యాలలో 10, ఎల్లారెడ్డిలో 13, నిజామాబాద్‌, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ నియోజకవర్గాల్లో 10 శాతం, సిరిసిల్లలో 8, హుజూరాబాద్‌లో 12 శాతం, సిద్ధిపేట, వరంగల్‌ పశ్చిమలో 10 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ సిబ్బందితో, ఏజెంట్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై, వసతులపై ఆయన అడిగి తెలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X