హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ అర్బన్ లో డిఎస్ ఓటమి: లక్ష్మినారాయణ గెలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Narayana
హైదరాబాద్‌ : నిజామాబాద్ అర్బన్ శాసనసభా నియోజకవర్గంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయనపై బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణ విజయం సాధించారు. లక్ష్మినారాయణ 12 వేల 40 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో శ్రీనివాస్ కు ఇది రెండో ఓటమి. సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన లక్ష్మినారాయణ చేతిలో ఓడిపోయారు.

ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ 11వ రౌండ్ వరకు లక్ష్మినారాయణ డిఎస్ పై ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఆ తర్వాత రౌండ్ రౌండ్ కూ లక్ష్మినారాయణపై డిఎస్ మెజారిటీ సాధిస్తూ వచ్చారు. దాంతో లక్ష్మినారాయణ మెజారిటీ తగ్గింది. ప్రజలు తెలంగాణ వాదాన్ని గెలిపించారని బిజెపి నాయకుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. తమ పార్టీ అభ్యర్థి లక్ష్మినారాయణపై వ్యతిరేకత లేదని, అయితే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని రుజువైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X