కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి టిజి వెంకటేష్ స్వస్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
కర్నూలు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటూ అమాయకులను బలిదానం చేస్తోందని రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్ టిజి వెంకటేష్ మండిపడ్డారు. విద్యార్థులను తెరాస అధినేత కేసీఆర్‌ ఆత్మహత్యలకు ప్రేరేపించటం దారుణమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఆగే వరకు తాము ప్రత్యేక ఉద్యమాన్ని నిలిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈనెల నాలుగోతేదీన తాము శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరు కావడం లేదని ప్రకటించారు. తెలంగాణ ఇవ్వాలి, వద్దు అనే పోరాటంలో పాల్గొనమని చెప్పారు.

తెరాస అధినేత చంద్రశేఖర్‌రావు సైతం రాయలసీమ వెనుకబడిందని చెప్పారన్నారు. కమిటీకి అన్నీ వివరించిన తరువాత తుది తీర్పునకు వేచి ఉండాలే గాని, శవరాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కమిటీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సలహా ఇచ్చి వాస్తవాలు తెలుసుకుని విచారణ చేపట్టాలన్నారు. ఆగస్టు 14వతేదీన గ్రేటర్‌ రాయలసీమ పరిధిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి హక్కుల సాధనపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

శ్రీకృష్ణ కమిటీ విచారణపై అనేక అనుమానాలున్నట్లు టీజీ చెప్పారు. ఆత్మహత్యలు, ఆందోళనలకు లొంగి తీర్పు ఇచ్చే పరిస్థితి కమిటీలో కనిపిస్తోందన్నారు. 119లో 12 సీట్లకు పదేపదే రాజీనామా చేసి గెలవడం ఇదే తెలంగాణ ప్రజాభిప్రాయం అని మభ్యపెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ 'సీమ' పరిధిలోకి రాని జర్నలిస్టులను ఇక నుంచి ఈ ప్రాంతంలో పని చేయనీయమంటూ ఆయన చెప్పారు. పత్రికలే సగం ద్రోహం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ ఆస్తులు, పత్రికలను కాపాడుకునేందుకు తెలంగాణ భజన చేస్తూ 'సీమ' హక్కులు కాలరాస్తున్నాయని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X