అలా చెప్పడానికి టిజి వెంకటేష్ ఎవరు: ఎర్రాసు ప్రతాపరెడ్డి
ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం గెలిచిందన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాదని ప్రభుత్వ విప్ శైలజానాథ్ అన్నారు. కొందరు నేతల వైఖరి వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని అన్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణవారు కాబట్టి తెలంగాణ సెంటిమెంటు వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచిందని అంటున్నారని ఆయన అన్నారు. తాము ఈ నెల 5వ తేదీన శ్రీకృష్ణ కమిటీని కలిసి సమైక్యవాదం వినిపిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. కుసుమకుమారి తొలగింపును రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు.
Comments
Story first published: Tuesday, August 3, 2010, 14:45 [IST]