హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలా చెప్పడానికి టిజి వెంకటేష్ ఎవరు: ఎర్రాసు ప్రతాపరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: సమైక్య నినాదంతో ఉద్యమాన్ని ఆపేస్తున్నామని ప్రకటించడానికి టిజి వెంకటేష్ ఎవరని కాంగ్రెసు రాయలసీమ శాసనసభ్యుడు ఎర్రాసు ప్రతాపరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగే వరకు రాయలసీమ హక్కుల వేదిక ఉద్యమాన్ని ఆపేస్తున్నామని తమ పార్టీ శాసనసభ్యుడు టిజి వెంకటేష్ ప్రకటించడాన్ని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. ఉద్వాసనకు గురైన శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయం విసి కుసుమకుమారి రాజకీయాలు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం గెలిచిందన్నది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం కాదని ప్రభుత్వ విప్‌ శైలజానాథ్‌ అన్నారు. కొందరు నేతల వైఖరి వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైందని అన్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణవారు కాబట్టి తెలంగాణ సెంటిమెంటు వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచిందని అంటున్నారని ఆయన అన్నారు. తాము ఈ నెల 5వ తేదీన శ్రీకృష్ణ కమిటీని కలిసి సమైక్యవాదం వినిపిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. కుసుమకుమారి తొలగింపును రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X