హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశవరావుకు చిత్తశుద్ధి ఉంటే తెరాసలో చేరాలి: గోనె ప్రకాష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Keshav Rao
హైదరాబాద్: ఇంతటి చారిత్రాత్మక ఫలితాలను చూడలేదని తమ పార్టీ నాయకుడు కె. కేశవరావు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలపై చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు నాయకుడు గొనె ప్రకాష్ రావు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణపై అంత చిత్తశుద్ధి ఉంటే కేశవ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారనడానికి ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కేశవరావు చేసిన ప్రకటనపై ఆయన ఆ విధంగా అన్నారు.

ఇటువంటి ఫలితాలు చూడలేదని కేశవరావు అన్న మాటల్లో నిజం లేదని, 1971లో తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్) విజయం ఇలాంటిదే అని ఆయన అన్నారు. కేశవరావు లాంటి సీనియర్ల వల్లనే తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయిందని ఆయన విమర్శించారు. గత రెండు ఉద్యమాల్లో సమైక్యవాదిగా ఉన్న కేశవరావుది పార్టీ మారిన చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీతో తెలంగాణ సాధ్యం కాదని, యుపిఎ అంగీకరిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X