వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వెళ్లినా ప్రభుత్వానికీ, పార్టీకీ నష్టం లేదు: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
తాడిపత్రి: పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం వల్ల ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రంవంటిదని, ఇందులోనుంచి ఎవరు బయటికి వెళ్లినా ఇసుమంత నష్టం కూడా జరగదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకే కుర్చీ కోసం ఇరువురి మధ్య పోరాటం జరుగుతుండడం వల్ల పార్టీలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ నర్మగర్భంగా చెప్పారు. ఇప్పటికే చిరంజీవి, ఇతర పార్టీనేతలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను మార్చే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ అ«ధిష్ఠానం తరచూ ముఖ్యమంత్రులను మార్చే విధానానికి స్వస్తి చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య సీనియర్ నాయకులని, మాటల్లో కంటే చేతల్లో చూపించే తత్వమున్న వ్యక్తి అని కొనియాడారు. 'పీసీసీ అధ్యక్ష పదవికి మీపేరు పరిశీలనలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఏమంటారు' అని ఒక విలేకరి ప్రశ్నించగా జేసీ స్పందిస్తూ తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు ఇంకా సమయం ఉందని, ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చ జరగలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X