హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ జగడంలో షీలా దీక్షిత్ తనయుడి ప్రవేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: అధిష్టానంతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సంధి కుదర్చడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి తనయుడు, పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ రంగంలోకి దిగారు. జగన్ స్వయంగా సందీప్ దీక్షిత్ ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు. జగన్‌ పార్లమెంటు సమావేశాల సందర్భంగా సందీప్‌ దీక్షిత్‌ను కలిసి తన మనసులోని మాటను చెప్పినట్లు తెలిసింది. సందీప్‌ దీక్షిత్‌ను ఒకటి రెండు రోజుల్లో మరోసారి కలిసి పార్టీ అధిష్ఠానం వద్దకు తన పశ్చాత్తాప సందేశాన్నిః వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు చేసిన ఆందోళనలపై ఆయన ఆత్మావలోకానికి దిగారు. అనాలోచితంగా ఇప్పటిదాకా సాగించిన ఉద్యమాలన్నీ అటు పార్టీకి, ఇటు తనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కూడా జగన్ వదులుకున్నట్లు చెబుతున్నారు. కెవిపి రామచందర్ రావు, సబ్బం హరి వంటి హితులు ఇచ్చిన సూచనల మేరకు అధిష్టానంతో రాజీకి రావడమే మేలని భావించి జగన్ సందీప్ దీక్షిత్ ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X