ఆత్మరక్షణలో సీమాంధ్ర మంత్రులు: మాట మార్చిన గాదె

సీమాంధ్ర నేతలను తెలంగాణలో తిరగనివ్వమన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాటలకు కాంగ్రెసు పార్టీలోని వారే వంత పాడడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడం దేశద్రోహులని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. గాదె, ఇతర సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా మండిపడడమే కాకుండా తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. సోమవారం తెలంగాణలో నిరస కార్యక్రమాలు జరిగాయి. సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీమాంధ్ర మంత్రులు తమ వ్యాఖ్యను ఉపసంహరించుకోకపోతే తాము సహించబోమని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవ రావు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications