వైయస్ జగన్ తప్పుడు యుద్ధం చేస్తున్నారా?

వైయస్ జగన్ ఫిర్యాదును బట్టి ఆయన పరిణామాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం మేరకే రాష్ట్రంలోని పార్టీ నాయకులు జగన్ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే అలా వ్యవహరిస్తున్నారని అనిపిస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ వైయస్ జగన్ ను సాధ్యమైనంత బలహీనం చేసే పనికి ఒడిగట్టారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కాస్తా మెతగ్గా వ్యవహరిస్తుండడం వల్ల, కెవిపి రామచందర్ రావు ఎత్తుగడల వల్ల జగన్ కు ఎక్కువ సమయం లభించినట్లు కూడా భావిస్తున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు విమర్శలు చేసినా, రాయలసీమ శాసనసభ్యులు ఆరోపణలు చేసినా అది అధిష్టానం ప్రమేయంతోనే జరుగుతుందనే విషయాన్ని జగన్ పసిగట్టకపోవడం మొత్తం వ్యవహారంలో పెద్ద లోపం. పైగా, అధిష్టానానికి జగన్ ఏ మాత్రం విధేయతను ప్రదర్సించడం లేదు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి నడిపిన అసమ్మతి రాజకీయాలను ప్రస్తుతం తాను నడుపుతున్నట్లు భావిస్తే జగన్ పప్పులో కాలేసినట్లేనని భావిస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications