వైయస్ జగన్ ఓదార్పు తీరుపై ప్రణబ్ ముఖర్జీ అసహనం

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కేంద్ర మంత్రి, సీనియర్ పార్టీ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికి రెండు సార్లు జగన్ ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ రెండు సందర్భాల్లోనూ జగన్ తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు ఇచ్చిన విందుకు జగన్ హాజరయ్యారు. అయితే, విందు మధ్యలోనే వెళ్లిపోయి ఆయన ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

ఓదార్పు యాత్రను రాజకీయం చేయడంపై జగన్ ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రణబ్ ఓదార్పుపై జగన్ కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వైయస్ మరణానికి షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలను జిల్లా కేంద్రాలకు రప్పించి ఆర్థిక సహాయం అందించాలని, ఓదార్పు యాత్ర పేర హంగూ ఆర్భాటాలతో జిల్లాలంతటా పర్యటించాల్సిన అవసరం లేదని ప్రణబ్ సూచించినట్లు సమాచారం. అలాగే, ఓదార్పు యాత్రను పార్టీపరంగా చేపట్టాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

అయితే, ప్రణబ్ సూచనలను పాటించడానికి జగన్ విముఖత ప్రదర్సించారని, ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, పావురాల గుట్ట వద్ద తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాధితుల ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పినట్లు సమాచారం. జగన్ వాదన పట్ల ప్రణబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+