ఇవియంలపై ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు నాయుడు పోరాటం

Chandrababu Naidu
న్యూఢిల్లీ: ఈవీఎంలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని కోరినా ఇప్పటివరకు ఎందుకు నిర్వహించలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. ఈవీఎంలో లోపాలున్నాయని అన్ని పార్టీలు ఈసీని కలిసినా ఎందుకు సరిచేయడం లేదని ఆయన అడిగారు. లోపాలు సరిదిద్దాలన్న హరిప్రసాద్‌ను అరెస్టు చేయడం ఈసీ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. లోపాలు సరిచేస్తామని ప్రకటించకపోతే ప్రజల్లో అపోహలు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈవియంలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్సి ప్రకాశ్‌కారత్‌తో, 7 గంటలకు రాష్ట్రీయ లోకదళ్ నేత అజిత్‌ సింగ్‌తో సమావేశమవనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+