రాజీవ్ గాంధీని జగనేమైనా చంపారా: సబ్బం హరి

జగన్ ను చేసిన ఘోరమేమిటని సబ్బం హరి అన్నారు. జగన్ ను ఎందుకు టార్గెట్ చేసుకున్నారని ఆయన తెలంగాణ పార్లమెంటు సభ్యులను అడిగారు. సోనియా గాంధీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారా అని అడిగారు. జగన్ గురించి మాట్లాడితే ఒక్కటిచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో సర్వే సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. బయ్యారంలో కోట్లు దండుకుంటున్నారని సర్వే ఆరోపించారు. దమ్ముంటే దానిపై విచారణ జరిపించాలని సబ్బం హరి సవాల్ చేశారు. వారి మధ్య గొడవను తగ్గించడానికి కాంగ్రెసు ఎంపిల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications