వైయస్ జగన్ ఓదార్పుపై హైకమాండ్ దిగి వచ్చిందా?

YS Jagan
హైదరాబాద్: పార్టీ అధిష్టానం తాజా ప్రకటనతో కూడా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. ఓదార్పు యాత్రను కొసాగించడానికే ఆయన నిర్ణయించుకున్నారు. జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రను ఆపాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఓదార్పు యాత్ర సాగించాలనే జగన్ వర్గం నిర్ణయించుకుంది. ఓదార్పు యాత్రకు వస్తున్న స్పందన చూశాకే పార్టీ వైఎస్‌ తమ నాయకుడే అనే సంకేతాన్ని పంపించేందుకు తపన పడుతోందనే కోణంలోనే జగన్‌వర్గం తాజా పరిణామాలను విశ్లేషిస్తోంది. అధిష్ఠానం తాజా వైఖరి వెనుక ఉన్న వ్యూహం ఏమైనా తాము మాత్రం వెనక్కి తగ్గేదిలేదని ఆ వర్గం నేతలు తేల్చి చెబుతున్నారు. పార్టీలో వైఎస్‌ సన్నిహితులుగా ముద్రపడ్డ మంత్రులు, నేతలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధిష్ఠానం నిర్ణయం తమ నేత ప్రభావమేననే ధోరణిని ప్రదర్శిస్తోంది. దీనికి ఓదార్పు యాత్రకు ఎలాంటి సంబంధం లేదని, దేనిదారి దానిదేననే ఆ శిబిరంలో కీలకనేతగా ఉన్న అంబటి రాంబాబు తెగేసి చెప్పారు. జగన్‌కు ఓదార్పు యాత్రలో జనం బ్రహ్మరథం పట్టబట్టే అధిష్ఠానం దిగి వచ్చిందనే రీతిలో జగన్‌ వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ నిర్ణయంతో మరింత ఊపు లభిస్తుందని వారంటున్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల గురించి పార్టీ పట్టించుకోలేదని జగన్‌ కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చిందని వీరు చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+