ముంబై: 57వ జాతీయ చిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ జాతీయ చిత్రంగా మళయాళ చిత్రం కుట్టిశ్రాంక్ ఎన్నికయింది. ఉత్తమ నటుడిగా అమితాబ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. పా చిత్రంలో నటనకు ఆయన ఎన్నికయ్యారు. సహాయ నటుడిగా లాహోర్ చిత్రంలో నటించిన ఫారూక్ షేక్, ఉత్తమ నటిగా అనన్యాఛటర్జీ(బెంగాళి), సహాయ నటిగాఅరుంధతీనాగ్(పా) ఎన్నికయ్యారు. ఉత్తమ సామాజిక చిత్రంగా శ్యామ్ బెనగల్ రూపొందించిన వెల్ డన్ అబ్బా, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం ఢిల్లీ-6, అందరినీ అలరించిన 3ఇడియట్స్ చిత్రం ప్రజాధరణ, నిర్మాత,దర్శకత్వ విభాగంలో ముందు నిలిచాయి. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రాన్ని ఉత్తమ కొరియో గ్రాఫర్ (శివశంకర్), స్పెషల్ ఎఫెక్ట్ (కణల్ కణ్ణన్)లలో పురస్కారాలు వరించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ఇళయరాజాను వరించింది.