చిరంజీవి ప్రజాచైతన్య యాత్రలో అపశృతి: 4గురికి గాయాలు
State
oi-Pratapreddy
By Pratap
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి చేస్తున్న ప్రజాచైతన్య యాత్రలో అపశృతి చోటు చోసుకుంది. గురువారం రాజాంలోని పాలకొండ జంక్షన్లో చిరు యాత్ర జరుగుతుంది. చిరంజీవిని చూడటానికి భారీగా జనం వచ్చారు. చెట్లపైకి, భవంతుల పైకి ఎక్కి చూసేందుకు ప్రయత్నించారు. చిరును చూడటానికి కొందరు ఓ గోడ పైకి ఎక్కారు. ఆ గోడ కూలడంతో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని రాజాం ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి వరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.