అక్రమ మైనింగ్ పై సోనియా మౌనంపై బాబు ధ్వజం

ఆక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు ఏం చేయాలో కూడా కొందరు రాజపుత్రులకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. 2001 నుండి 2008 మధ్య 6లక్షల 50వేల కోట్ల రూపాయల నల్లధనం బయటి దేశాలకు వెళ్లినట్లు ఓ అధ్యయనం తేల్చిందని, అంటే ఎన్ని లక్షల కోట్ల అక్రమాలు జగుతున్నాయో తెలుసుకోవచ్చన్నారు. మైనింగ్ మాత్రమే కాకుండా మట్టిని సైతం తవ్వి బంగారాన్ని సృష్టించుకున్నారని, దాంతో సామాన్యులు ఇందులో సమిధలు కావాల్సి వస్తోందన్నారు. మైనింగ్ ఐనా, అటవి సంపద ఐనా, మట్టి ఐనా జాతి సంపద, అంటే అది ప్రజలది. కాబట్టి ఆ ఆస్థిని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకునే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. అధికారం కోసం ఎలాంటి దుశ్చర్యలకైనా కొందరు వెనకాడటం లేదని, దానిని చేతకాని రోశయ్య ప్రభుత్వం చూస్తూ కూర్చుందన్నారు. వారిని ఎమైనా అంటే తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు ఉన్నారని దుయ్యబట్టారు.
సోనియాగాంధీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడంపై చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. అక్రమార్కులకు భయపడో లేక వారితో కుమ్మక్కు కావటం వల్లనే ఆమె నోరుమెదపటం లేదన్నారు. రోశయ్య, సోనియా గాంధీలు ఊరుకున్నప్పటికీ ప్రజల సొమ్ము లూటీ చేస్తుంటే ఊరుకునేది లేదని, దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని అయన హెచ్చరించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications