హైకోర్టుకు లాయర్ల ర్యాలీ, ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జీ

నిరసనకు మద్దతు తెలపడానికి రంగారెడ్డి, నాంపల్లి కోర్టు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో సమావేశమైనారు. అనంతరం హైకోర్టుకు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకొనడానికి ప్రయత్నించారు. న్యాయవాదులు మాత్రం వెనక్కు తగ్గకుండా కోర్టుకు బయలుదేరారు. ఐతే పోలీసులు వీరిని మదీనా వద్దకు వచ్చిన తర్వాత అడ్డుకొని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని సిటీ అవుట్ స్కర్ట్స్ లలో ఉన్న బొల్లారం తదితర పోలీస్ స్టేషన్ లకు తరలించారు. తెలంగాణ న్యాయవాదులను చర్చలకు ఆహ్వానించడానికి ఇద్దరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వెళ్తున్నారు. మంత్రి గీతారెడ్డి ఆదేశాల మేరకే తాము న్యాయవాదుల వద్దకు వెళ్తున్నట్లు ఎంపి మధు యాష్కీ చెప్పారు.
హైకోర్టు ఆదేశాల మేరకే కోర్టు ఆవరణలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. కోర్టు మరోసారి ఆదేశాలు ఇచ్చేవరకూ బందోబస్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా హైకోర్టులోకి అనుమతులు, పాస్లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ నౌషద్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications