కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఉత్తవే: తులసి రెడ్డి

మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదర రాజనర్సింహలపై ఉస్మానియా ఐకాస చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని భయపెట్టడం చిన్న పిల్లల చేష్టల మాదిరిగా ఉందన్నారు. విద్యార్థులు అలా ప్రవర్తించకూడదని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, నిబంధనల ప్రకారమే రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలుంటాయని మంత్రి దానం నాగేందర్ విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.
మున్సిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయలేదని, కొన్ని సమాచార సాధనాలు ప్రభుత్వం వెనుకంజ అని రాస్తున్నాయని అది సరి కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మహిళలను 33 శాతం వాటా విషయం నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి తప్పితే వేరే ఏ కారణము లేదన్నారు.












Click it and Unblock the Notifications