నాగార్జున రెడ్డి రాజీనామా ఉపసంహరణ చెల్లదంటూ కోర్టులో పిల్
గత వారం తెలంగాణవారికి హైకోర్టులో 42 శాతం వాటా కావాలని తెలంగాణవాదులు నిరాహార దీక్ష, నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణవాదం పేరుతో బాధ్యతయుత వృత్తిలో ఉన్న తెలంగాణ న్యాయవాదులు కోర్టు పనులు అడ్డుకున్నారని, హైకోర్టు ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రవర్తించారని జస్టిస్ నాగార్జునరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కక్రూకు, రాష్ట్రపతినికి ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపారు. రెండు రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తి కక్రూగాని, మరికొందరు న్యాయవాదులు రాజీనామా ఉపసంహరించు కోవాల్సిందిగా విజ్జప్తి చేసినప్పటికీ ఆయన తోసిపుచ్చారు. అనంతరం రెండు రోజుల తర్వాత తెలంగాణ లాయర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతామని మాట ఇచ్చిన అనంతరం తెలంగాణ లాయర్లు నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఆ తర్వాత నాగార్జునరెడ్డి కూడా హైకోర్టు ప్రతిష్ట పునరుద్దరించడంలో భాగంగా తను రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.