డి శ్రీనివాస్ విందు సమావేశానికి సీమాంధ్ర ఎంపిలు డుమ్మా

భిన్నాభిప్రాయాలంటే విభేదాలు కావని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు సమస్యలను పార్టీ వేదికలపైన మాత్రమే వెల్లడించాలని ఆయన సూచించారు. పార్టీని కలిసికట్టుగా ముందుకు నడిపించేందుకు అందరూ అంగీకరించారని ఆయన చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా పార్టీ విధానాలపై మాట్లాడాలని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలని కూడా ఆయన సూచించారు. పార్టీ నాయకులు ఎవరు కూడా తమ పరిధి దాటి మాట్లాడవద్దని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని కూడా అన్నారు. డిఎస్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపిలు సూచించారు.












Click it and Unblock the Notifications