వైయస్ జగన్ క్యాంప్ పై చర్యల వెనక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి?
నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి క్షణం పడేది కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి సరైన అవకాశాలు దక్కకుండా వైయస్ ప్రధాన పాత్ర పోషించారని అంటారు. అలాగే, నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం వెనక వైయస్ పాత్ర ఉందని చెబుతారు. నెల్లూరు జిల్లాలో నేదురుమల్లికి వ్యతిరేకంగా వైయస్ తన సొంత లాబీని బలంగా తయారు చేశారు. దీంతో వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. మంత్రి రామనారాయణ రెడ్డి, శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదు. వారిని బుజ్జగించడానికి వైయస్ జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకే ఎసరు పెట్టేందుకు నేదురుమల్లి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.