ఖమ్మం జిల్లాలో మళ్లీ పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు
నక్సలైట్లు పరారయిన తర్వాత వారు సమావేశం అయిన ప్రాంతంలో కిట్ బ్యాగులు, వంటసామాగ్రి పోలీసులకు దొరికాయి. కాగా పారిపోయిన నక్సలైట్ల కోసం పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు. హెలికాప్టర్ ద్వారా పారిపోయిన నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కాగా నాలుగేళ్ల క్రితం జగదీష్ అనే మావోయిస్టు నేతను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన తర్వాత మరో ఒకటి రెండుసార్లు పోలీసులు,నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఆ తర్వాత పరిస్థితి చక్కబడింది. జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం క్రమంగా తగ్గింది. మావోయిస్టులకు ముఖ్యప్రాంతమైన చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఉండటంతో అక్కడ నక్సల్స్ ఎప్పుడు విరుచుకు పడతారో తెలియని పరిస్థితి. అయితే మూడేళ్ల ప్రశాంతత తర్వాత తాజాగా జరిగిన కాల్పులు జిల్లాలోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలను భయానికి గురి చేస్తున్నాయి.
Comments
Story first published: Wednesday, October 6, 2010, 14:10 [IST]