హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ - గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ కు సిజె ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: విజయవాడ - గుంటూరుల మధ్య హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న బెజవాడ బార్ అసోసియేషన్ విజ్ఞప్తికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆహ్మద్ నిసార్ కక్రూ సానుకూలంగా స్పందించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన వస్తే తాను 24 గంటల్లోగా పుల్ కోర్టు ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక పంపుతానని ఆయన చెప్పినట్లు వారు విలేకరులతో పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ధర్నా చేస్తుండటంతో కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలంటే ఆందోళన విరమించాలని ఆయన సూచించినట్లు చెప్పారు.

కాగా తెలంగాణ న్యాయవాదులు హైకోర్టులో 42 శాతం వాటా కోసం పోరాడినప్పుడు, ఎంతో కాలంగా ఉన్న తమ హైకోర్టు బెంచి డిమాండును ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. తమకు హైకోర్టుకు రావాలంటే ఎక్కువ దూరం అవుతుందని, ఖర్చులు, సమయం వృధా అవుతుందని, ఆందుకే తమకు హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని వారు ఇటీవల ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. వారి ఆందోళనకు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా పలువురు మద్దతు పలికారు. కేంద్రం కూడా ప్రత్యేక బెంచ్ కు సిద్ధంగా ఉందని లగడపాటి ఆందోళన సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X