త్వరలో టిడిపి ఖాళీ అవుతుంది: మంత్రి దానం

Danam Nagender
హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కాంగ్రెసు పైనా, రోశయ్యపైనా విమర్శలు చేస్తున్నారని మంత్రి దానం నాగేంద్ర కెబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం అలా వ్యవహరించడం లేదన్నారు. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు త్వరలో పార్టీని వీడి రావటం ఖాయమన్నారు. చివరకు ఆ పార్టీలో చంద్రబాబు, ఆయన బావమరుదులు మాత్రమే మిగులుతారన్నారు. ప్రభుత్వ పథకాలపై టిడిపి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు.

2004కు ముందు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు పూర్తి నిరాశతో, నిస్పృహలో ఉన్నారని మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రవేశ పెట్టనన్ని పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని, టిడిపి కంటే కాంగ్రెసు పాలనలోనే గౌరవంగా జీవిస్తున్నామన్న భావన ప్రజల్లో ఉందని అలాంటప్పుడు కాంగ్రెసు ను విమర్శించే అర్హత టిడిపికి లేదన్నారు. వారి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాని ఇప్పుడు వర్షాలు పడటంతో పాటు సాగు పెరిగి రైతులు అనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెసు పాలనను టిడిపి విమర్శించడానికి కారణం పథకాలపై అవగాహన లేక పోవటమే, ప్రజలను మభ్యపెట్టాలనుకోవడమో కారణం కావచ్చని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స మెంట్సు టిడిపి 300 కోట్లు రూపాయలు ఇస్తే కాంగ్రెసు ప్రభుత్వం 3000 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.

చేనేత కార్మికుల సంక్షేమ పథకాలకు కేబినేట్ ఆమోదం తెలిపినట్టు పర్యాటక శాఖా మంత్రి గీతారెడ్డి తెలిపారు. చేనేత కార్మికులకు ఇంతకుముందు ఇచ్చిన రుణాలను, వాటి వడ్డీని మాఫీ చేసి కొత్తగా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఓ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+