హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ జెఎసి మీట్ వద్ద కవితపై గొడవ: కెసిఆర్ గైర్హాజర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) స్టీరింగ్ కమిటీ సమావేశం వద్ద బుధవారం తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హాజరవుతారని మొదట చెప్పారు. అయితే ఆయన దానికి హాజరు కాలేదు. అందుకు గల కారణంపై తెరాస వివరణ కూడా ఇవ్వలేదు. ఈ సమావేశంలో ప్రజా గాయకుడు గద్దర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం.

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సమావేశం వెలుపల గొడవకు దిగారు. కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించిన కోటి బతుకమ్మల జాతరను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కొంత మంది విద్యార్థులు ఒక్కసారిగా లేచి ఆందోళనకు దిగారు. తెలంగాణ కోసం దాదాపు 400 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో బతుకమ్మ ఉత్సవాలు జరపడం తగదని వారన్నారు. అయితే, బుధవారంనాడు కవిత కోటి బతుకమ్మల జాతరను ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X