రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రిలో గాలిలో చక్కర్లు కొట్టిన చంద్రబాబు నాయుడి విమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజమండ్రి: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించిన కింగ్ ఫిషర్ ఫ్లైట్ సేఫ్ గా రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగింది. శంషాబాద్ నుండి బయలుదేరిని ఫ్లైట్ రాజమండ్రి చేరుకున్నప్పటికీ అక్కడ ప్రతికూల వాతావరణం ఉండటంతో ల్యాండ్ కావడానికి సమస్య ఏర్పడింది. దాదాపు అరగంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. దీంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరూ ఉత్కంఠకు లోనయ్యారు. ఐతే 12.45కు సేఫ్ గా దిగటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఫ్లైట్ లేటయ్యింది. దీంతో చంద్రబాబు కార్యక్రమాలు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకే రాజమండ్రి చేరుకోవాల్సిన చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా వెళ్లవలసి వచ్చింది.

కాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం చంద్రబాబునాయుడు గురువారం ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లి, అయితే వాతావరణం అనుకూలించక పోవటంతో రాజమండ్రి వెళ్లాల్సిన కింగ్ ఫిషర్ ఫ్లైట్ ను అధికారులు అనుమతించలేదు. చంద్రబాబు నాయుడు అదే ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన సుమారు ఉదయం తొమ్మిది గంటలనుండి విమానాశ్రయంలోనే నిరీక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X