రాజ్ న్యూస్ టీవీ ఛానల్ వర్సెస్ నాగం జనార్ధన్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చిన ఏకైక ఛానల్ రాజ్ న్యూస్ పై నాగంకు అంత అక్కసు ఎందుకని సీఈవో ప్రశ్నించారు. ఛానల్ వచ్చిన ఆరు నెలల్లోనే అత్యధిక తెలంగాణ ప్రజలు దీనిని చూస్తున్నారన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలను దెబ్బ కొడుతున్నందుకా, బాబ్లీపై చంద్రబాబు నాయుడు కేవలం నాటకం ఆడాడని నిరూపించినందుకా, తెలంగాణ అనుకూలమని చెప్పి కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించిన వెంటనే కనీసం 24 గంటలు గడువకముందే మాటమార్చిన చంద్రబాబును ఎండగట్టినందుకా అని మండిపడ్డారు. తెలంగాణకోసం పనిచేస్తున్న ఛానల్ పై కక్ష చూపిస్తే 4కోట్ల తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆయన హితవు పలికారు.
రాజ్ న్యూస్ పై నాగం చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా నాగం ప్రవర్తిస్తున్నారని, మళ్లీ ఇలాంటి వ్యాక్యలు చేస్తే సహించేది లేదని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హెచ్చరించారు. నాగం వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, పలువురు తెరాస నేతలు ఖండించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications