హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వైఖరి మారనంత వరకు అంతే: ప్రసన్నకుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మారనంత వరకు తెలుగుదేశం పార్టీ బాగుపడదని ఆ పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఆయన శనివారం ఎనిమిది పేజీల లేఖ రాశారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఈ బహిరంగ లేఖ రాశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి, ఇతరుల అవినీతిని ప్రశ్నించే ముందు చంద్రబాబు తన చరిత్ర ఏమిటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడపోతే లక్షల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగారని ఆయన ప్రశ్నించారు.

రెండెకరాల ఆసామి చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగారని పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలను పెట్టించలేకపోయిన చంద్రబాబు వైయస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు విశ్వసనీయత లేని నాయకుడని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X