కె కేశవరావుపై గుర్రుమంటున్న సీమాంధ్ర కాంగ్రెసు నేతలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ కోసం సోనియాను అడిగి బయటికి వచ్చానని మరో సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు తాను బతికే ఉంటానని, అది ఇంకెంతో దూరం లేదని తెలిపారు. రాష్ట్రంలో కలెక్షన్లు ఎక్కువ కావడంతో ప్రాజెక్టుల అంచానాలు పెరుగుతూనే పోతున్నాయని వెంకటస్వామి విమర్శించారు. గతంలో గాంధీ భవన్లో వైఎస్ఆర్ను తిట్టనని ప్రకటించినప్పుడు ప్రాణహిత- చేవెళ్ల నిర్మాణానికి రూ. 20 వేల కోట్లతో జీవో విడుదల చేశారన్నారు. అనంతరం అది రూ.32 వేల కోట్లు అయిందని, ప్రస్తుతం పెరుగుతూనే పోతోందని వివరించారు. రూ కోట్లు చెల్లించినా తట్టెడు మట్టితీసిన దాఖలాలు లేవని చెప్పారు. దీనికి కారణం కలెక్షన్లు పెరిగిపోవడమేనని విమర్శించారు. రూ. కోట్లు దోచుకుతినడం జరిగిందన్నారు. రాజీవ్ రహదార్ల నిర్మాణంలో 600 మంది గుత్తేదార్లు పనులు చేస్తే ఇద్దరు మాత్రమే తెలంగాణ వారు ఉన్నారని పేర్కొన్నారు.
ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగులుతాయి తప్ప ఉపయోగం లేదని మంత్రి గీతారెడ్డి తెలిపారు. కొందరు అదేపనిగా ఉసిగొలిపేందుకే ఉంటారని, చనిపోయిన అనంతరం ఏమీ చేయరని, కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని తెరాసను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇటీవల న్యాయవాదులను తెరాస అధినేత కేసీఆర్ రెచ్చగొట్టి ఆమరణ దీక్ష చేయించారని, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర పన్నారని విమర్శించారు. అనంతరం ఎంపీలు వారితో చర్చించి సమస్యను చక్కదిద్దారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే అవకాశం జాతీయ పార్టీకే ఉంటుందని, ప్రాంతీయ పార్టీలకు, ఉప ప్రాంతీయ పార్టీ అయిన తెరాసకు లేదని పేర్కొన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీల అంగీకారంతో సీఎం అధ్యక్షతన తీర్మానం చేశామని, ఎవరికీ అభ్యంతరం లేదని తెలిపారు. మాజీ మంత్రి జీవన్రెడ్డి మాట్లాడుతూ ఇంత వరకు ప్రపంచంలో పోరాటంలో ప్రాణాలు వదిలినవారు ఉన్నారు కానీ బలిదానాలతో ఉద్యమాన్ని బలోపేతం చేసింది చరిత్రలో తెలంగాణలో మాత్రమేనని చెప్పారు. సమావేశంలో 25 మంది నాయకులు ప్రసంగించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో అమరులైన 19 మంది కుటుంబాలకు రూ. లక్షచొప్పున ఆర్థిక సాయం చేశారు.












Click it and Unblock the Notifications