వైయస్ జగన్ అంత టాక్స్ కడితే తప్పేంటి: అంబటి రాంబాబు

Ambati Rambabu
గుంటూరు: కాంగ్రెస్ జగన్ వర్గం నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి రోశయ్యపై మరోసారి ధ్వజమెత్తారు. కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా 84 కోట్ల రూపాయలు పన్నును చెల్లించడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారని అలా కట్టడంలో తప్పేమిటని ఆయన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. భారతీ సిమెంట్స్ లో అమ్మిన వాటాలకు వచ్చిన డబ్బులకు ఆ టాక్స్ కట్టాడని, దానికి కొన్ని జగన్ వర్గ వ్యతిరేక వర్గాలు, పత్రికలు, కాంగ్రెసులోనే కొందరు వ్యతిరేకులు టాక్స్ కట్టడాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఓదార్పుకు వస్తున్న ఆదరణ చూడలేకే వారు అనవసరంగా జగన్ లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. జగన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి తమరు నూకలు చెల్లినట్లేనని భావించిన ప్రతిపక్షనాయకుడు, కాంగ్రెస్ వ్యతిరేక నాయకులు జగన్ను దెబ్బతీయాలకుంటున్నారని, ఆయితే జగన్ ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు.
br />మంత్రులందరూ అవినీతీపరులేనంటూ ఢిల్లీలో రాయపాటి చేసిన వ్యాఖ్యలకు తాను ఆవేదన చెందినట్లు తెలిపారు. మంత్రులందరూ అవినీతిపరులే అయితే ముఖ్యమంత్రి కూడా అవినీతిపరుడే అవుతాడన్నారు. రాయపాటి వ్యాఖ్యలను రోశయ్య చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడని, రాయపాటి వ్యాఖ్యలు క్రమశిక్షణారాహిత్యం క్రిందకు రాకుంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా క్రమశిక్షణా రాహిత్యం కిందకు రావని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+